వీణవంక,( కరీంనగర్ జిల్లా)
కేసీఆర్, కేటీఆర్ లు పగటి కలలు కంటున్నారు .
మరో 15 ఏళ్లపాటు మేమే ఉంటాం అంటున్నారు.
నేటి ధాత్రి:రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా అద్భుతమైన పాలన అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసి నాశనం చేసిన కేసీఆర్ ఇపుడు రాష్ట్రంలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సిగ్గులేకుండా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు .
వారు మాట్లాడే మాటలు జనం చీ కొడుతున్నారు కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలు అవినీతితో జైల్లో పడడం ఖాయం…
చేరికల విషయంలో బిఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలు వారి అసహనానికి నిదర్శనం..ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న వారు అంత కాంగ్రెస్ వారే..ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు లు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే బిఆర్ఎస్ విమర్శలు చేస్తుంది.
కేసీఆర్ గతంలో జగన్ ను ఇంటికీ పిలిచి విందులు ఇవ్వలేదా కేసీఆర్ ఆంధ్రకు పోయి అక్కడ తిని రాయలసీమ ను రతనాల సీమ చేస్తాం అనలేదా చేరికలు సీఎం ల మీటింగ్ ల విషయంలో బిఆర్ఎస్ గంతములో ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మాట్లాడ్డం భావ్యం కాదు మీరు చేస్తే ఒకటి కాంగ్రెస్ చేస్తే మరికటిఆ తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారు అని మండల అధ్యక్షుడు సాహెబ్ హుస్సేన్ అన్నారు.