నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న నూనావత్ కిషన్ కుమారుడు లోకేష్ ఎంబీబీఎస్ సీటు పొందాడు. జూన్ నెలలో జరిగిన ఆల్ ఇండియా నీట్ ద్వారా జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. అందులో నర్సంపేట మండలం బోజ్యనాయక్ తండాకు చెందిన లోకేష్ ను ఎంబీబీఎస్ సీటు వరించింది. కాగా బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లోకేష్ ప్రవేశం పొందాడు.