భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవం.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మే డే ఉత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, భగత్ సింగ్ స్టాచ్ దగ్గర పట్టణ అమాలి సంఘం జెండాను రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, ఏరియా హాస్పిటల్ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, భవన నిర్మాణ సంఘం జెండాను భవన నిర్మాణ కార్మిక సంగం జిల్లా కార్యదర్శి జాడి పోచం, రైల్వే స్టేషన్ జెండాను మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోనీ, ఇంక్లైన్ జెండాను పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూర్ రామచందర్, రైల్వే రధగంబాల జెండాను శాఖ కార్యదర్శి ఎన్ రాజన్న పాత బెల్లంపల్లి జెండాను జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అరుణ పతాక ఆవిష్కరణలు చేసినారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్ ప్రసంగిస్తూ చికాగో అమరుల రక్తంతో తడిసి ఎర్రజెండాగా అవతరించింది. కార్మికులను 16 గంటలు పని చేస్తూ కట్టు బానిసలుగా తయారు చేస్తూ నీరం కుశంగా అణచివేస్తున్నందుకు నిరసనగా 1886లో అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించినారు. అట్టి రాలిపై పోలీసులు జరిపిన కాల్పులలో ఎంతోమంది కార్మికులు వీర మరణం పొందారు. వారి పోరాట ఫలితంగా ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి నారు. వారి పోరాట స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ 44 కార్మిక చట్టాలను సాధించాము. మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడు లుగా మారుస్తూ కార్మిక హక్కులను హరించు చున్నది. కావున దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సంగటితమై కేంద్ర ప్రభుత్వ విధానం కు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రక్షించుకొనటానికి సమరశీల పోరాటాలు చేయవలసి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తామని ఆపరేషన్ కగారు పేరిట కేంద్ర బలగాలతో కర్రెగుట్టలను ఆక్రమించుకొని జల్లేడపడుతూ జీవించే హక్కును హరించవద్దని మరియు నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కి రావాలని వారితో చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు ఈ సందర్భంగా కోరుతున్నాయి. కార్యక్రమంలో మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, డిఆర్ శ్రీధర్, గుండా చంద్ర మాణిక్యం, బియ్యాల ఉపేందర్, మేకల రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, ఏ ఐ టి యు బ్రాంచి సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, పట్టణ కార్యవర్గ సభ్యులు మంతెన రమేష్, రత్నం రాజం, రామచందర్, బొల్లం తిలక్ అంబేద్కర్, దాసరి అనిల్ కుమార్, పట్టణ లోడింగ్ అన్లోడింగ్ అమాలి సంఘం కార్యదర్శి కుందేళ్ళ శంకర్, కా సిపేట మైన్ 1 పిట్ కార్యదర్శి మీనుగులక్ష్మీనారాయణ, కా సిపేట మైన్ 2 ఫిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.