యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.

Bathini Mahesh. Bathini Mahesh.

యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.

#గొర్ల మందపై గాబు పట్టిన గావోచ్చోళ్ళు.

#కుల పెద్దమనిషి బత్తిని మహేష్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

యాదవ కుల ఆచారంలో భాగంగా గొర్ల మందపై గాబు పట్టే కార్యక్రమాన్ని మండల కేంద్రంలో కుల పెద్దమనిషి బత్తిని మహేష్ ఆధ్వర్యంలో పెద్ద బోయిన కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో యాదవ కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొర్రెను గాపు పట్టి ఆచారంలో భాగంగా బలి కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి యాదవ కుటుంబం సుభిక్షంగా సుఖశాంతులతో అందరూ క్షేమంగా ఉండాలని అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని.

Bathini Mahesh.
Bathini Mahesh.

 

గొల్ల కులమ గావోచ్చోళ్ళు యాదవ కులదైవలను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఆ దేవతల ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్లు భాష బోయిన సమ్మయ్య, మూటికే కట్టయ్య, వేల్పుల కృష్ణ, కుంట మల్లయ్య, నాన బోయిన పుల్లయ్య, గావచ్చోళ్ళు కిన్నెర వీరమల్లు, యాకమల్లు, భాస్కర్, నరేష్, నవీన్, ఐలయ్య, యాకమ్మ, హైమ, ప్రశాంత్, కుల పెద్దలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!