
Ganesh Chaturthi Celebrations in Zahirabad
విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి వినాయకుడి పూజలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఆ ఘననాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సకల విజ్ఞాలు తొలిగి సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు.
ఈకార్యక్రమంలో వారితో పాటు జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి మాజీ కౌన్సిలర్లు అక్తర్ గోరి రంగా అరుణ్ కుమార్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి నల్లా ప్రతాప్ రెడ్డి నథానెయల్ నర్సింహా యాదవ్ మాజీ జెడ్పీటీసీ నరేష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ జిల్లా ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,ఎస్టీ సెల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజు నాయక్,ఇమామ్ పటేల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ గణేష్ మండపాల ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.