రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను అకస్మాత్తుగా
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను మెరుగైన చికిత్స
అందించాలని ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు
మెరుగైన వైద్యం అందించాలని గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రత్యేకంగా మాతృ సేవా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సంస్థాగ్రత ప్రసవాలు చేయడం
పేద ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూడాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఈ పైలెట్ ప్రాజెక్టును చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సూచించారు అదేవిధంగా ఔట్ పేషెంట్ కౌంటర్ వద్ద పేషెంట్ కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ టోకెన్ సిస్టంను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు, ల్యాబ్ లో
శాంపిల్ కలెక్షన్ చేసుకున్న తర్వాత రిపోర్టు అందించేందుకు ఆక్సిజన్ ప్లాట్ వైపు తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేయాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు
ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన చికిత్స అందిస్తూ
ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగేలా చూడాలని
వైద్యులకు సూచించారు. ఈ తనిఖీల్లో పర్యవేక్షకులు
డాక్టర్ మురదర్ రావు మున్సిపల్ కమిషనర్ ఆయాజ్
తదితరులు పాల్గొన్నారు.
మాతృ సేవా కార్యక్రమాన్ని ప్రభావంతంగా అమలు చేయాలి.
