బిఆర్ఎస్ నుండి బిజెపిలోకి భారీగా చేరికలు

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కి ప్రజాబలం లేదు

ప్రజలంతా బిజెపి వైపు మోడీ పాలన వైపు మొగ్గు చూపుతున్నారు

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలో గల హసన్ పర్తి లోని కె ఎల్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో బిఆర్ఎస్ మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి ఎర్రగట్టు గుట్ట మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని విడి బిజెపి లోకి హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 200 మందికి పైగా చేరారు. వీరికి బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ బీజేపీలో చేరేవారు త్యాగం చేస్తున్నట్టు లెక్క
త్యాగధనులకు స్వార్థ పరులకు మధ్య పోటీ ఇది.
కాంగ్రెస్ కి ఓటు వేస్తే దాని విలవ జీరో పేదవాళ్ల బ్రతుకులు మరింత బాగుపడాలంటే సుస్థిర పాలన కొనసాగాలంటే.. అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి. నిండు మనసుతో నన్ను మోదీ నీ ఆశీర్వదించండి. పార్టీలో చేరిన వారిలో 66 వ డివిజన్ నాయకులు శిలం రాజేందర్, పిట్టల ముక్తిశ్వర్, గోనెల కుమారస్వామి, పెద్దమ్మ కోంరేల్లి, రమేష్ ముని పల్లి గ్రామం నుంచి అలుగు శ్రీధర్, ఉచిత రాజయ్య, ఉచిత రవి, బిక్షపతి, నాగారం గ్రామం నుంచి దేవునూరి హరీష్, వల్లాల వినయ్, కోలిపాక రేవంత్, వంశీ, వంగ పహాడ్ నుంచి గోనెల శ్రీకాంత్, శ్రీనివాస్, రవి, సుమన్ ముచ్చర్ల నుండి శివ కుమార్, ప్రసాద్  సుదాన్ పల్లి నుండి ఆళ్ల రవీందర్, శంకర్ హసన్ పర్తి నుండి శివ కుమార్, రాజ్ కుమార్ తదితరులకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి SC మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండెటి శ్రీధర్, పార్లమెంటరీ ప్రబారి మురళిధర్, కార్పొరేటర్లు అభినవ్ భాస్కర్, గురుమూర్తి, నాయకులు కుమారస్వామి, కేశవరేడ్డి, జెడ్పీటీసీ సునీత, పిఎసిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్, తిరుపతి, రాజేశ్వర్ రావు, రాం చంద్ర రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *