అంగన్వాడి కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం నాడు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, పాఠశాల చైర్మన్ వడ్ల నర్మద, గర్భిణీ స్త్రీలు, పసి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!