
మంచిర్యాల, నేటి ధాత్రి:
కాజీపేట – బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8 వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్ళించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో మంచిర్యాల, కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు,వ్యాపారస్థులు ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీ పై ఆధారపడాల్సి ఉంటుంది.