మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గొప్ప ఆర్థికవేత్త లో ఒకరు, నాయకులు సంస్కర్త అన్నిటికంటే మించి మన కాలంలోని మానవ తావా ది మన్మోహన్ సింగ్ జి ఇక లేదని అన్నారు. సద్గుణం ని ష్కలమైన సమగ్రత నిర్ణయం తీసుకోవడంలో అన్నిటికంటే మానవీయత చూసే వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేస్తూ , ఆయన కుటుంబానికి యావత్తు భారతదేశ ప్రజలకి తీరని లోటు మహాత్మా మళ్ళి జన్మించాలి భారతదేశ పునర్నిర్మాణంలో భాగం కావాలి ఆయన ఆశయాన్ని కొనసాగించేటువంటి వంటి బాధ్యత అలాగే భారతదేశ ప్రజల మీద ఉన్నదని ఆశిస్తూ అన్నారు.ఈ కార్యక్రమంలో మారపేల్లి రవీందర్ ,దుబాసి కృష్ణమూర్తి, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి రాజు, కట్టయ్య, చిందం రవి, బాసని రవి-శాంత, మార్కండేయ, ప్రపంచ రెడ్డి, రఫీ, అన్ని గ్రామాల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!