ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ
పరకాల నేటిధాత్రి :
మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ అధ్యక్షులు వెంకన్న ను మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని,కోశాధికారి మల్లికార్జున,ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి విత్తనాలు లో,ఎరువులు,పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు మీకు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.