డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసినారు మండలకాంగ్రెస్ అధ్యక్షులు లంక అబ్బులు

భారతదేశ పూర్వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల దుమ్మగూడెం మండలకాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం వ్యక్తం చేసినారు మండలకాంగ్రెస్ అధ్యక్షులు లంక అబ్బులు

భద్రాచలం నేటి ధాత్రి

గొప్ప ఆర్ధికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట ప్రధానమంత్రి పివి నరసింహా రావు మంత్రి వర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు.

2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు.వారి మరణం దేశానికి తీరని లోటున్నారు ఈకార్యక్రమంలో మండలనాయకులు మట్ట శివాజీ తోటమళ్ళ సుధాకర్ గెడం బాలాజీ అయ్యప్పరెడ్డి శ్రీధర్ కెల్లా శేఖర్ లంక ప్రసాద్ జీరి సత్యనారాయణ వెంకటేష్ గోపి గుడ్ల శ్రీను చంటి తదితరులు పాల్గొన్నారు

మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూన్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!