బిజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా మంద మహేష్

గణపురం నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా
గణపురం మండలం గురువారం రోజున గణపురం మండల కేంద్రానికి చెందిన మంద మహేష్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మంద మహేష్ మాట్లాడుతూ తన ఈ స్థానానికి రావడానికి గల ఎరుకల గణపతి ప్రేరణతో ఏబీవీపీ లో చేరి ఎన్నో విద్యా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా అక్రమ కేసులకు భయపడకుండా 2009 -2011 వరకు ఏబీవీపీలో కార్యకర్త మొదలైన మహేష్ 2012- 2014లో గణపురం మండల ఏబీవీపీ కన్వీనర్ గా 2014- 2017 లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా 2017- 2021లో బీజేవైఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2021 -24 లో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశానని గత 15 సంవత్సరాల ప్రస్థానం లో జరిగిన ప్రతి ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేయడం జరిగిందని తన ఎన్నికకి సహకరించిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ళ మహేందర్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి, సత్యపాల్ రెడ్డి .బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడునుతుల నిషీదర్ రెడ్డి , భూపాలపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి అన్న ,బీజేపీ రాష్ట్ర నాయకులు నాగపురీ రాజమౌళి గౌడ్ ,వెన్నంపల్లి పాపయ్య ,చదువు రాంచద్ర రెడ్డి ,లింగంపల్లి ప్రసాద్ రావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గొర్రె శేశి కుమార్ ఏబీవీపి పూర్వ నాయకులకు, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *