రైతునేస్తం కార్యక్రమం నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని భాగ్యలక్ష్మీ ఆధ్వర్యంలో వీక్షించడం జరిగింది. ఈకార్యక్రమంలో అధిక వర్షాల వల్ల ప్రస్తుత పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించడంతో పాటు ఋణమాఫి పథకంలో భాగంగా రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబ నిర్ధారణ చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఋణ మాఫీ పథకానికి అర్హులై ఉండి రేషన్ కార్డు లేని రైతులు వ్యవసాయాధికారి వద్ద కుటుంబ నిర్ధారణ చేయించుకోవాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో చోప్పదండి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారిణి ఎమ్.ప్రభావతి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!