Man Dies After Road Accident Injuries
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
జైపూర్,నేటి ధాత్రి:
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంచిర్యాల పోలీస్ వారు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ మండలం కాన్కూర్ గ్రామానికి చెందిన యాదన వేన తిరుపతి (42) తన భార్య శ్రీలత ఇద్దరు కుమారులతో మంచిర్యాలలో నివాసం ఉంటూ నస్పూర్ లో హమాల్ పని పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం నస్పూర్ లో పని ముగించుకుని మంచిర్యాలకు వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.మంచిర్యాల పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
