చెట్టుకొమ్మ విరిగి పడి వ్యక్తి దుర్మరణం…

చెట్టుకొమ్మ విరిగి పడి వ్యక్తి దుర్మరణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం శేకాపూర్ గ్రామంలో చెట్టు నరికే పనికి వెళ్లిన అశోక్ (45) అనే వ్యక్తి, చెట్టు కొమ్మ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో, చెట్టు కోస్తుండగా కిందపడిన కొమ్మ అశోక్ తలకు బలంగా తగిలి తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version