
తహశీల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ కోసం నెల రోజుల నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ శేఖర్ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. శేఖర్ ను సిబ్బంది అడ్డుకున్నారు.