
పార్ధీవ దేహానికి నివాళులర్పించిన మాలహల్ రావు
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల దామోదర్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి,వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి,ఘన నివాళ్లులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసిన నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి కుడ్ల మలహాల్ రావు వెంట నడికూడ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు,ఎఎమ్సి డైరెక్టర్ భోగం కమల,పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,చౌటుపర్తి గ్రామ కమిటీ అధ్యక్షులు ఓదేలా రవి,ముస్తలపల్లి గ్రామా కమిటీ ఎస్సి సెల్ అధ్యక్షులు బోట్ల అనిల్,నార్లపూర్ గ్రామ బూత్ కమిటీ సభ్యులు శనిగరపు రవీందర్, ముస్తాలపల్లి మాజీ సర్పంచ్ బోట్ల రవి, రాజేందర్(రమాకాంత్),రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి నీరటి రాములు, సీనియర్ నాయకులు బందెల స్వామి తదితరులు పాల్గొన్నారు.