హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మే 22న తేదీన జరిగే హిందూ ఏక్తా యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. ప్రతి ఒక్క హిందూ పార్టీలతో, కులలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరు సంఘటితమై స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. ప్రతి ఒక్క హిందూ హాజరై ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, కారుపాకల అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేం కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.