ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్ లతో బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము.ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్.. రాజు.. పాల్గొన్నారు.