భారత కమ్యూనిస్టు పార్టీ
జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి ఆడెపు రాజమౌళి
23/03/2025 ఆదివారం,
సమయం:ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ కార్యాలయం ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవించింది, దున్నేవానికి భూమి ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికై ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాటం చేసింది,సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము కావున నియోజకవర్గ ప్రజలు ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్ జిల్లా సంస్థ సభ్యులు గుండా చంద్ర మాణిక్యం మేకల రాజేశం నాయకులు రత్నం రాజం కుందేళ్ళ శంకర్ గుండా ప్రదీప్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.