
AISF State Vice President Sothuku.
విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.
ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష సంఘాల పిలుపు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్ లో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు. ప్రవీణ్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ ఈ నెల జులై 23వ తేదీనా రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు.విద్యరంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్,ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ వ్యాన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 23న జరిగే విద్యాసంస్థల బంద్ ని
ప్రభుత్వ, ప్రెవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు,విద్యార్థులు తల్లిదండ్రులు బందులో పాల్గొని మద్దతు తెలియజేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పొంగంటి రాజేష్ వికాస్ అతుకూరి తిరుపతి ముద్దమల్ల విష్ణు హర్షవర్ధన్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.a