కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి.

Dharna Dharna

జూన్ 4న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి

CITU పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బి.వై.నగర్ లోని కామ్రేడ్,అమృత్ లాల్ శుక్లా భవనంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెల రోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందని ఇంకా సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో దాదాపు 2200 మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉందని అధికారులను ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండవ విడత సబ్సిడీ డబ్బులు రాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారని సబ్సిడీ రావలసిన కార్మికులకు కాలయాపన చేయకుండా అధికారులు వెంటనే రేపటి వరకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.మొదటి విడత సబ్సిడీ వచ్చి నెల రోజులు అవుతున్న సబ్సిడీ రానీ కార్మికులకు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ , వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4 వ. తేదీ బుధవారం రోజున CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో సబ్సిడీ డబ్బులు రాని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ నాయకులు స్వర్గం శేఖర్,సందు పట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!