-విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ
పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించే నూతన జాతీయ విద్యా విధానం- 2020ని రద్దు చేయాలని కోరుతూ, కాకతీయ యూనివర్సిటీలో ఏప్రిల్ 23న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామర్స్ సెమినార్ హాల్ ఉదయం 10:30 గంటలకు సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు విద్యార్థులు, మేధావులు ,ప్రజాస్వామికవాదులు హాజరై జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ పద్మజాషా తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. దేశంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు వలన జరిగే పర్యవసనాలు ఈ సదస్సులో చర్చించి, భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఏఐఎస్ఎఫ్, పి.డి.ఎస్.యు ఎస్.ఎఫ్.ఐ, యు.ఎస్.ఎఫ్.ఐ, బి.ఎస్.ఎఫ్, ఏ.బి. ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, రహెమాన్, బి. నరసింహారావు, భాష బోయిన సంతోష్, మాలోత్ రాజేష్, శివ కుమార్, సాయి కిరణ్, పృధ్విరాజ్, జస్వంత్ ,పరిమళ, వేల్పుల చరణ్ మచ్చ పవన్ కళ్యాణ్, నరేందర్ , బండారి పృథ్వీరాజ్, అనూష, కావేరి, మమత, లక్ష్మి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.
కేయూ లో జరిగే సదస్సును జయప్రదం చేయండి.
