Dr. Santosh Campaigns for Giri Prasad’s Massive Victory
గిరి ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించండి
డా.సంతోష్ ప్రచారానికి బ్రహ్మరథం
పరకాల,నేటిధాత్రి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల బీజేపీ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోని 21వ వార్డులో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు.డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పరకాల అభివృద్ధి కోసం కృషి చేసే వారికి కాకుండా డబ్బున్న వారికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు టికెట్లు ఇచ్చాయని విమర్శించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి సంపాదించేందుకే వారు ప్రయత్నిస్తారని,అలాంటి వారికి ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు.బీజేపీ అభ్యర్థులు అవినీతి లేకుండా అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
21వ వార్డులో బీజేపీ అభ్యర్థి బండారి గిరి ప్రసాద్ యువ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల కోసం నిలబడ్డాడని అన్నారు. పరకాల పట్టణ వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి యువ నాయకులను గెలిపించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చేసిన ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టారు. బీజేపీ పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న నాయకుల కృషిని పార్టీ నేతలు అభినందించారు.ఈ ప్రచారంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
