భద్రాచలం నేటి ధాత్రి
శాంతినగర్ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన రావులపల్లి
భద్రాచలం10/05/2024
13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంటు స్థానానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాలోత్ కవిత గెలుపును కోరుతూ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణం శాంతినగర్ కాలనీలో 148 149 బూతులలో విస్తృత ప్రచారం నిర్వహించారు..
ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా గులాబీ జెండాకు పట్టణ కట్టాలని కోరారు.
మాలోత్ కవిత గెలుపు ద్వారానే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందిందని అన్నారు..
ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆకోజు సునీల్ కుమార్.పడిసిరి శ్రీనివాస్. కాపుల సూరిబాబు. పట్టాభి.నర్సింహులు. సీతామహాలక్ష్మీ. రమాదేవి. శివ. అప్పారావు. దానియేలు ప్రదీప్. నర్సమ్మ .పూజల లక్ష్మి తదితరులు ఉన్నారు