చెప్పిన పని చేయకపోతే ఇంటి ముందుకి చెప్పు తీసుకొని రండి: మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి 09 అక్టోబర్ (నేటిధాత్రి):
మల్కాజ్గిరి నియోజకవర్గం,ఆనంద్ బాగ్ పరిధిలోని బృందావన్ గార్డెన్స్ లో సోమవారం బిఆర్ఎస్ పార్టీ అత్మియ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై తీవ్రంగా విరుచుక పడ్డారు.మల్కాజిగిరి కి నాలుగున్నర సంవత్సరాలుగా పట్టిన గ్రహణం వీడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన, నియోజకవర్గం అభివృద్ధి చేయని అసమర్ధ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాల నుండి మల్కాజ్గిరి లో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు సొంత పార్టీ నాయకులను కూడా భయభ్రాంతులకు గురిచేసి, మల్కాజ్గిరి అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డ ఘనత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకే దక్కుతుందని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే మైనంపల్లి హయాంలో మల్కాజ్గిరి నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులను కూడా ఖర్చు చేయని నాయకుడు మైనంపల్లి అని అన్నారు. మల్కాజ్గిరి లో అంతో ఎంతో అభివృద్ధి జరిగిందంటే కార్పొరేటర్లు జిహెచ్ఎంసి నుంచి తెచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి చెందింది గాని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ద్వారా ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. తాను మల్కాజ్గిరి నుండి గెలిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అన్నారు, లేనియెడల చెప్పుతో తన ఇంటి ముందుకు వచ్చి నిలదీయొచ్చని అన్నారు.ఎంబిసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అతను తల్లిగా నమ్మిన, మైనంపల్లి హనుమంతరావుకు రెండు సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీని వీడవవలసి వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇచ్చినా మైనంపల్లి హనుమంతరావుని కూడా కొట్టి బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు.ఉద్యమకారుడు రావుల అంజయ్య మాట్లాడుతూ,గతంలో మైనంపల్లికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో వచ్చిన 70000 మెజారిటీ టిఆర్ఎస్ పార్టీ నీ చూసి వేసినవే తప్ప మైనంపల్లి మొకం చూసి పడ్డ ఓట్లు కవు అని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి ఇంచార్జ్ బద్దం పరశురామ్ రెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావుకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడకొట్టాలని అన్నారు.ఐదు ఏళ్ళు జైల్ జీవితం గడిపి బయటకు వచ్చినట్టుందని, మల్కాజ్గిరి లో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే మైనంపల్లిని ఓడ కొట్టాలని అంటారు.జేఏసీ నాయకుడు వెంకన్న మాట్లాడుతూ మైనంపల్లి హన్మంతరావు కి నాయకులు,కార్యకర్తలు అన్నీ విధాలుగా సహకరించిన తమను పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడొచ్చిన నాయకులైన రాష్ట్ర కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులను గౌరవించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు మీనా ఉపేందర్ రెడ్డి, సునీత రాము యాదవ్,విజయశాంతి, మురుగేష్, నాయకులు ఆకుల నర్సింగ్ రావు, వీరేశం యాదవ్, వెంకట్ రాఘవన్,వెంకన్న, గొట్టిముక్కల శ్రీనివాస్, జ్యోతి, కృష్ణ గౌడ్, సిద్ధి రాములు, ఖలీల్, తో పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.