జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో
ఆధ్వర్యంలో గురువారం రోజున మహాత్మా జ్యోతి భాపూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో గొప్ప ఉద్యమాలను చేపట్టి ప్రజల్ని ఉత్తేజపరిచి సమసమాజం నిర్మాణం వైపు నడిపించి, మూఢనమ్మకాలు నుండి విడిపించి, జ్ఞాన చైతన్య యాత్రను ప్రారంభించి, సామాజిక జీవన శైలిలో ఎన్నో నూతన మార్పులను తీసుకువచ్చి, అందరూ ఇష్టంగా మహాత్మా అని పిలుచుకునే మహనీయుడు మహాత్మ శ్రీ జ్యోతి బాపూలే జయంతి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తితో చూపిన బాటలో మనమంతా నడవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి మోర్ల మధూకర్ , ఆర్ ఎస్ ఎస్ జైపూర్ ఉప మండల ప్రమఖ్ మంతెన ఉదయ్ కిరణ్, శివాజీ సేన సహ కార్యదర్శులు వేముల సాయి కిరణ్, సొల్లూరి సంజయ్, కోశాధికారి మంతెన రవితేజ, సభ్యులు పల్లికొండ వెంకటేష్, వేల్పుల శివ, జనగామ నితిన్, సంగణేష్ రెడ్డి, రిక్కుల సాయి రెడ్డి ఆంజనేయ స్వామి మాలదారులు మొదలైన కార్యకర్తలు పాల్గొన్నారు.