రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర వైభోపేతంగా నిర్వహిస్తాం

ఈవో డి కృష్ణ ప్రసాద్

వేములవాడ,నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాశివరాత్రి జాతర వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఈవో కృష్ణ ప్రసాద్ పరిశీలించారు.

మార్చి 8 వ రోజున మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థము మంచినీటి వ్యవస్థ, క్యూ లైన్లు, ప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం పార్కింగ్ పనులను పరిశీలించారు.

జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.

కార్యక్రమంలో ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, ఎడ్ల శివ, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *