మహబూబ్ నగర్ సరస్వతి పుత్రుల నిలయం.

Saraswati Saraswati

మహబూబ్ నగర్ సరస్వతి పుత్రుల నిలయం.

గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ నేటిధాత్రి:

మహబూబ్ నగర్ సరస్వతి పుత్రుల నిలయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలో టెట్, డిఎస్సీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 250 మంది అభ్యర్థులకు టెట్ మరియు డిఎస్సీ మెటీరియల్స్ ను క్యాంపు కార్యాలయంలో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాలు విద్యావ్యవస్థ నిర్విర్యం అయ్యిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు నింపకుడా కాలయాపన చేశారని, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన మండిపడ్డారు.

Saraswati
Saraswati

పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి టెట్ మరియు డిఎస్సీ కి కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే టెట్ మరియు డిఎస్సీ కోసం హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత ప్రత్యేక ఉచిత కోచింగ్ ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తుందని, ఇప్పటికే ఒకసారి డిఎస్సీ నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. రానున్న టెట్ డిఎస్సీ పరీక్ష లో ఉత్తమ ఫలితాలు సాధించి, జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, టి. పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గుండా మనోహర్, నాయకులు అవేజ్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఉమర్, అంజద్, ఖాజా పాషా, చర్ల శ్రీనివాసులు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!