ఘనంగా వటావృక్ష కల్యాణ మహోత్సవం..
హిందూ ముక్తిస్తల్ ఆధ్వర్యంలో, శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము.
కాశీబుగ్గ, నేటిధాత్రి

వరంగల్ తూర్పు కాశీబుగ్గ లోని వివేకానంద జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ముక్తి స్థలంలో ప్రతి యేటా లోక కల్యాణం కోసం మహాశివరాత్రి ముందు రోజు నిర్వహించే కార్యక్రమం మహా శివరాత్రి ముందు మంగళవారం రోజున ఉదయం 11-16 ని.లకు ఉత్తరాషాడ నక్షత్రంలో లక్ష్మీ నారాయణ, శివపార్వతుల వటావృక్ష కల్యాణ మహోత్సవము హిందూ ముక్తిస్తల్ కమిటీ ఆధ్వర్యంలో పద్మ బ్రాహ్మణులు గజ్జెల రాజ్ కుమార్ శాస్త్రి, కోడం ప్రవీణ్, రాచర్ల రాజు లోక కళ్యానార్థం, నానావిధ ఆత్మానాం గోత్రస్య మహారుద్ర హోమం హిందూ ముక్తిస్తల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బూర రాంచందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తుల సహకారముతో వటవృక్షం కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, అదే విధముగా ఇక్కడి నాయకుల సహకారముతో మరియు దాతల సహకారముతో హిందూ ముక్తీస్థల్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భముగా తెలియజేశారు. ఈ కార్యక్రమములో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్, బీజేపీ నాయకులు సముద్రాల పరమేశ్వర్, ఉపాధ్యక్షులు పడాల నరసింగరావు, శీలం బాబురావు, గోషికొండ సుధాకర్, ఇప్ప ఆదినారాయణ, నలువల మురళీ, ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు, వర్కింగ్ కార్యదర్శి వంగర భాస్కర్, సహాయ కార్యదర్శులు ఆకేన వెంకటేశ్వర్లు, గుములపురం ఉప్పలయ్య, గాదె ప్రభాకర్, కోశాధికారి ఉప్పుల రమేష్, సహాయ కోశాధికారి అంబటి అశోక్ కుమార్, సుంకనపెల్లి శ్రీనివాస్, ప్రతాపని సుధాకర్, టీ.వి. అశోక్ కుమార్, పెరుమాండ్ల సురేష్, భాకం హరిశంకర్, వంగరి సూర్యనారాయణ, బింగి మహేష్, మరియు మధు, శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.