మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలి.

# నేడు మచ్చాపురం ఓంకార్ స్థూపం వద్ద వర్ధంతి సభ
# మాదన్నపేటలో కరపత్రాలను ఆవిష్కరించిన ఎం సిపిఐ (యు) నాయకులు
నర్సంపేట,నేటిధాత్రి :

ఎంసిపిఐ (యు )పార్టీ వ్యవస్థాపకులు,అమరజీవి,అసెంబ్లీ టైగర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని ఎం సిపిఐ ( యూ ) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కోరుతూ మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఆ పార్టీ నాయకులు కరపత్రాలు ఆవిష్కర చేశారు.అనంతరం కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ నైజాం పరిపాలనలో ఖాసిం , రజ్వీ సేనలు కొనసాగిస్తున్న దోపిడీ ,వెట్టిచాకిరి బానిసత్వానికి అలాగే మహిళలపై సాగిస్తున్న దారుణ ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఓంకార్ వీరోచితంగా పోరాడారన్నారు.ఆ మహనీయుడు స్ఫూర్తితో నేటితరం ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు.16వ వర్ధంతి సందర్భంగా ప్రస్తుత రాజకీయాలు మార్క్సిజం , అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై ఈ నెల 17 నుంచి 31 వరకు సభలు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.తొలుత ఈ నెల 17న గీసుకొండ మండలంలోని మచ్చాపురం వద్ద నిర్మించిన ఓంకార్ భారీ స్తూపం వద్ద వర్ధంతిసభ ప్రారంభమవుతుందని ఈ సభకు కార్యకర్తలు,ప్రజాసంఘాల నాయకులు,సానుభూతిపరులు , ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ ( యు ) జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం ,మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య , గ్రామ పార్టీ నాయకులు ఆకుల రాజేందర్ , కేశెట్టి అన్న సూర్య , గుర్రం రవి , గ్రామస్తులు అనుమాల వీరస్వామి , పెసరు సుదర్శన్ తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!