కారేపల్లి నేటి ధాత్రి
వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలాల బూత్ కమిటీలు ఏర్పాటు పార్టీ ఆదేశాల మేరకు పూర్తి చేశారు .ఖమ్మంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ గ్రామాల వారిగా బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు .ఈ బూత్ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉమాశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు పర్యటిస్తూ కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని ప్రతి 100 ఓటరుకు ఒక కార్యకర్తను నియమించుకోవాలని ప్రతి గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయమని ఓటర్ల తో నిమగ్నమై రాత్రి పడుకునే సమయంలో కారు గుర్తు కలలోకి వచ్చే విధంగా ఓటర్ల దగ్గరికి తిరగాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని గెలుస్తామని అన్నారు. గతంలో బి ఆర్ ఎస్ పార్టీ వైఫల్యం చెందిందని గతం కన్నా భిన్న రూపంలో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నా జీవితం నా గెలుపు కార్యకర్తల చేతిలో ఉందని ఉన్నారు. సింగరేణి మండలం లో పోడు రైతుదారులకు ఈ గ్రామం నుంచే పోడుపట్టాలు రైతులకు ఎక్కువగా అందాయని కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నలుగురు అభ్యర్థులు గ్రామాలలో పర్యటిస్తున్నారని వారు గ్రామాలలో పర్యటిస్తున్న కార్యకర్తలు అభ్యర్థుల పేర్లే సరిగా తెలియదని అన్నారు. గ్రామాలలో రంగురంగు కార్లు వేసుకొని తిరుగుతున్నారని ఓటర్ అభ్యర్థులు గ్రహించాలని గ్రామం అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టాలని కోరారు . వైరా నియోజకవర్గం మోడల్ కాంసెన్టిగా అభివృద్ధి చేయాలనే తన దేయమని 2009 ఎన్నికల నుండే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాసేవ నాయకుడిగా ఉండాలన్నదే తన లక్ష్యమని అన్నారు. మదన్ లాల్ చెప్పిందే చేస్తారని మాట ఇచ్చాక బొమ్మ చేసే పద్ధతి కాదని పార్టీలో నటించే వారికి తోకలు కట్ చేస్తానని పార్టీ గెలుపు కార్యకర్తలు కృషి వల్ల గెలిస్తే 1860 రోజులు నా వైపే ఉంచుకుంటానని లేనిపక్షంలో గల పట్టి అడగొచ్చు అని అన్నారు. ఎన్నికలు ఆశామాష కాదని ప్రతి ఒక్కరు తన బాధ్యత కర్తంగా కొనసాగాలని, నేను పేద వాడినని ఎమ్మెల్యే గిరి ఎవరికి తాకట్టు పెట్టనని ప్రజల మోకాలు దగ్గర ఎప్పటికీ ఉంటానని బి ఆర్ ఎస్ కు ఉన్న బలం ఏ పార్టీకి లేదని సభలో అన్నారు . కెసిఆర్ నమ్ముకున్న టికెట్ను వమ్ము చేయొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాములు నాయక్ సూచనలతో నియోజకవర్గంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ,ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ముందుకు పోవాలన్నారు .రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు , ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో జరిగిన అన్ని మండలాల బూత్ కమిటీల ఏర్పాటు పర్యవేక్షణ పూర్తి చేయడం జరిగిందని బూత్ కమిటీ సభ్యులందరూ ఆయ బూతుల పరిధిలో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ లాల్, మండల అధ్యక్షులు ఉమా శంకర్, అడ్డగోడ ఐలయ్య, ముత్యాల సత్యనారాయణ, వైస్ ఎంపిపి రావూరి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు, జడ్పిటిసి జగన్, వార్డు సభ్యులు గౌస్ ఉద్దీన్, నర్సింగ్ శ్రీనివాసరావు, రాము, హరీష్,మాజీ జెడ్పిటిసి వీరేందర్, పద్మావతి, హన్మకొండ రమేష్, బత్తుల శ్రీనివాసరావు, తోటకూరి రాంబాబు , గంగరబోయిన మురళి, సత్యం, అడప పుల్లారావు , సొసైటీ డైరెక్టర్ రోశయ్య, సర్పంచ్ కుమార్, ఎండి హనీఫ్, మణికొండ నాగేశ్వరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ ప్రజా హోదా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.