గణపతి మండపాలవద్ద రాత్రి 10,„వరకు తక్కువ సౌండ్ అనుమతి,…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T114914.128-1.wav?_=1

 

గణపతి మండపాలవద్ద రాత్రి 10,„వరకు తక్కువ సౌండ్ అనుమతి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగా రెడ్డి జిల్లా: జహీరాబాద్ మండల పరిది లోని గణేష్ నిర్వాహకులకు బహీరాబాద్ రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి విదాయక ప్రతిమను ప్రతిష్ఠించడలచినవారు

ముందస్తుగా జహీరాబాద్ రూరల్ పోలీసులకు ఆన్లైన్ %https://police portal.tspolice.goviny index.htm% లింక్ ద్వారా గణేష్ విగ్రహ వివరాలు నమోదు చేసి అట్టి పూర్తిచేసిన సమాచారం కాపీని పోలీస్ స్టేషన్ నందు సమాచారం నిమిత్తం అందించాలని

సూచిచ్చారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి జహీరాబాద్ రూరల్ పోలీసుల మాచనలు:అట్టి లింకులో మాదించిన వివరాలు పొందుపరిచిన అనంతరం, పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. వినాయక మండవం ఏర్పాటు చేయదలచిన ప్రదేశం వివరాలతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశం, రోజు, సమయం దారి వంటి వివరాలను కుదా

ఈ లింక్ ద్వారా నమోదు చేయవలిసి ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై కాలిబాటల పైన ప్రతిష్టించరాదు. ఎట్టి

పరిస్థితులలోను జనజీవనానికి అంతరాయం కలిగించరాదు. గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాల పార్సింగ్ కొరకు తగినంత దూరంలో, నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకొనే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి గణేష్ మండప నిర్వాహకులు: విద్యుత్ సరఫరాకై విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి భారీ వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద షార్ట్ సర్యూటీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, నాణ్యతతో కూడిన మండప నిర్మాణం రేపట్టాలన్నారు. మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లకు అనుమతి లేదు. ఎవరైనా లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద, ప్రార్థన మందిరాల వద్ద పెద్ద శాబ్దాలతో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయరాదు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యలు చేయడం, పాటలు పెట్టడం వంటివి చేయవారు. గణేష్ మండపాలను జాగ్రత్తగా

చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి గణేష్ మండపాల వద్ద టపాకాయలను, మందుగుండు సామాగ్రిని ఉండరాదు, మండపాల వద్ద కరెంట్ పోయినా, ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ల్యాంప్ అందుబాటులో ఉంచుకోవాలి. మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి. టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి గణేష్ మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు. గణేష్ మంటపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీరు సహకరించాలి. మట్టి వినాయక విగ్రహాలను పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మితిమీరిన విగ్రహ పరిమాణల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాంటించాలి.
అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారంబవ్వాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version