వీణవంక, ( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక, హిమ్మత్ నగర్ గ్రామాల మాజీ ఎంపిటిసి సభ్యురాలు ఆవాల మణెమ్మ పరమపదించిన సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట మాజీ శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు, మాజీ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,బండ శ్రీనివాస్ లు ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ, ఆమె భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు ఇవ్వడాన్ని కుటుంబ సభ్యులను అభినందించారు. సమాజంలో ఇలాంటి ఘటనలు చాల అరుదుగా ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో నూతన ఉరువడిని ప్రారంభించారన్నారు .ఎమ్మెల్యే వెంట వీణవంక మండల మాజీ ఎంపిపి ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ,మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి ,మాజీ ఎంపీపీ చుక్క రంజిత్, తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సామ్రాజ్యం యువజన నాయకులు జెకె ,అఖిల్ నాగిడి మధుసూదన్ రెడ్డి, కాసర్ల సుధాకర్, భరత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.