బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం నేతృత్వంలో అఖిలపక్షం నేతలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపడతామని ప్రకటించడం అభినందనీయమన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలు విశ్వసిస్తారన్నారు.