రైతులకు రుణమాఫీ మాట ఇచ్చాము.. నిలబెట్టు కుంటున్నాము
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
రైతన్నలకు రుణమాఫీ పండగ సందర్భంగా రైతుల రుణ మాఫీపై మాట ఇచ్చాము.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శాయంపేట బస్టాండ్ సెంటర్ నుండి రైతు వేదిక వరకు నాయకులు, రెైతులు ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ మిత్తిలకు కూడా సరిపోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల అధికారులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నేతలు,కార్యకర్తలు,రైతులు, అభిమానులు తదితర నాయకులు పాల్గొన్నారు.