నర్సంపేట,నేటిధాత్రి :
ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ ఫలితాల్లో దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు అర్హత పొంది ఉచిత సీట్లను సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ గట్టికొప్పుల విజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురుకుల ప్రవేశాలలో తమ పాఠశాల నుండి 22 విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగి సీట్లు సాధించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంతో పాటుగా ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జాంలలో పేద విద్యార్థులను తరలించేందుకు ఈ అవకాశాలను కల్పిస్తున్నట్లు విజెందర్ తెలిపారు. ఈ సందర్భంగా అర్హత పొందిన విద్యార్థులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, విష్ణు, రాధిక, అనిత, ప్రవళిక, శ్రావణి, కొమురయ్య విద్యార్థులు పాల్గొన్నారు.