సాహిత్యం గొప్పది….!
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము.సాహిత్యరంజని సాహితీ సాంసృతిక సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం ను నిర్వహించారు.

ప్రతి సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా లోని అన్ని మండలాల నుండి కవులను,రచయిత లను ,కళాకారుల ను ఆహ్వానించి తెలుగు భాషను ఉన్నతి కోసం ,తెలుగు భాష రక్షణ కోసం ఒక వేదికగా కవి సమ్మేళనం లను ఏర్పాటు చేసి సమాజంలో లో జరుగుతున్న వివిధ అన్యాయాలను గురించి, తమ తమ కవిత్వం ద్వారా సామాజిక చైతన్యం కలిగిస్తూ ,ఇప్పటి తరం పిల్లల్లో తెలుగు సాహిత్యం, తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజెయ్యడం లో కవుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది.
తమ పిల్లలకు ఏ భాష నైనా నేర్పండి కానీ తెలుగును మరవకండి అని ,పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని ,వివిధ ప్రాంతాలలో జరిగే పుస్తక ప్రదర్శన తమ పిల్లలకు భాగస్వామ్యం చెయ్యాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరమణ చారి తెలియజేసారు.
ఉగాది విశిష్టత చక్కగా వివరించారు.
ఈ కవి సమ్మేళనం లో వివిధ ప్రాంతాల కవులు పాల్గొని తమ తమ కవితలు గానం చేశారు.
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కవులు డా.పెద్దగొల్ల నారాయణ, కె. విట్ఠల్ లు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులకు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య రంజని అధ్యక్షుడు పెంటారెడ్డి, మొహమ్మద్ షరీఫ్,బాబూరావు,తదితరులు పాల్గొన్నారు.