జడ్చర్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులుగా లింగం యాదవ్ నియామకం.
జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ సమక్షంలో బీసీ సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్ చేతుల మీదుగా.. జడ్చర్ల నియోజకవర్గ బీసీ సేన ఉపాధ్యక్షులుగా సూరారం గ్రామానికి చెందిన లింగం యాదవ్ ను గురువారం నియమించారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల కోసం పనిచేస్తానన్నారు. బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్, బాలానగర్ మండల బీసీ సేన అధ్యక్షులు చాకలి మధు, శ్రీశైలం, పూజారి శ్రీశైలం, శేఖర్ గౌడ్ మల్లేష్ యాదవ్, శ్రీశైలం, పూజరి రమేష్, కురువ మహేష్,చాకలి వీరేష్, సరస్వతి శారదమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు.
