అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ విమోచనం

జీడి మల్లేష్ బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి విమోచన లభించిందని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జమ్మికుంట పట్టణంలోని బిజెపి కార్యాలయం దగ్గర కార్యకర్తలతో కలిసి మల్లేష్ జాతీయ జెండా ఎగరవేసారు. అనంతరం నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకొ ని బిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, భారత్ దేశానికి 1947 ఆగస్టు 15 వ తేదిన స్వాతంత్రం వచ్చి దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటే.. తెలంగాణ ప్రాంతం (హైదరాబాద్ సంస్థానం) ఆనాడు నిజాం నవాబు పరిపాలనలో ఉన్నదని గుర్తు చేశారు. నిజాం రాజు తన ప్రత్యేక సైన్యాన్ని (రజాకార్) ఏర్పాటు చేసుకొని దానికి కాసిం రజ్వి అనే ఒక నరరూప రాక్షసుడిని నాయకుడిని చేసి అతని ఆధ్వర్యంలో తెలంగాణలో మహిళల పైన అత్యాచారాలు చేయడం, మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, దోపిడీలు చేయడం, చిన్న పెద్ద తేడా లేకుండా క్రూరంగా హింసించడం జరిగిందని గుర్తు చేశారు. నిజాం దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *