హస్తం గుర్తుకు ఓటు వేద్దాం కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం: కూన సత్యంగౌడ్

కూకట్పల్లి, ఏప్రిల్ 26 నేటి ధాత్రి ఇన్చార్జి

హైదర్నగర్ డివిజన్లోని హైదర్ నగర్ గ్రామము,నందమూరి నగర్ ప్రశాంత్ నగర్,మిత్రాహిల్స్ తదితర బస్తీలు కాలనీలలో శుక్రవారం ఉదయం గడపగడపకు వెళ్తూ ఆయా ఓటర్ల ను కలిసి ఎంపిగా నిలబడిన రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిం చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి కిరాణా కొట్టు,ఆటో,రిక్షా,ప్రయాణి కులు కూరగాయల వ్యాపా రస్తులు ఎంతోమంది ఓటర్లను కలుస్తూ వారి ని తమ అభ్యర్థి 10 సంవత్సరాలు ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టిన అనుభవం ఉందని తెలిపారు. మంచి వ్యక్తిని ఎన్నుకొని భవిష్యత్తులో తమ కావాల్సిన అభి
వృద్ధి పనులను చేసుకునేందుకు మరింత సుగుమం చేసుకోవాల్సిన అవసరం మన చేతిలోనే ఆయుధ
మైన ఓటును కరెక్ట్ పర్సన్కు వేసి మమ్మల్ని పనులు చేయకపోతే నిలదీయాలని కూన సత్యంగౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,వెంక
టేష్యాదవ్,సాంబశివరావు,మారుతికుమార్,మణిక్యం,సాదాకృష్ణ మహి ళలు,ప్రజలు,యువకులు తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!