ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం
వరంగల్ డిఆర్ డిఓ కౌసల్యాదేవి
#నెక్కొండ, నేటి దాత్రి:
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ డిఆర్డిఓ కౌసల్య దేవి దీక్షకుంట గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ కౌసల్య దేవి మాట్లాడుతూ ప్రజలందరూ సింగిల్ యూజ్ గా ప్లాస్టిక్ను వాడం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని ప్లాస్టిక్ వలన కాలుష్యం పేరుకుపోయి పర్యావరణాన్ని తీవ్రంగా నష్టం చేస్తుందని ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని దిక్షకుంట్ల గ్రామంలోని మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి రెండు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీ ఎం శ్రీనివాస్, ఏపీఓ జాకబ్, దీక్షకుంట గ్రామపంచాయతీ సెక్రటరీ భాను ప్రసాద్, మహిళా సంఘాల వివో అధ్యక్షులు లత, మధులత, చంద్రకళ, వివో ఏ ఏకాంబరం, మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.