Drug Awareness Drive Held in Shayampet
నవతరాన్ని రక్షించు కుందాం డ్రగ్స్ నియంత్రణకు అడుగులు
శాయంపేట నేటిధాత్రి:
https://youtu.be/ZJjBTyuVhcQ?si=VyRoN5ZtE9KdMQDl
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద నవ తరాన్ని రక్షించుకుందాం డ్రగ్స్ నిర్మూలనకై ఎస్సై ఆధ్వర్యం లో మహోత్తరమైన కార్య క్రమం చేపట్టారు. నేటి తరం యువతతో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండ డంతో ఆందోళన చెందుతు న్నారు. దీన్ని అరికట్టడానికి డ్రగ్స్ నిరోధక చట్టాలను పదును తేల్చడం, శిక్షణ పెంపుతో పాటు పోలీస్ సిబ్బంది ప్రజలకు డ్రక్స్ వల్ల అనర్ధాలు గురించి వివరంగా తెలపడం జరిగింది. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పపరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది
పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట
ప్రతి మనిషి నిజ జీవితంలో ఎన్నో సవాళ్లు ఒత్తిళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది వాటి నుండి తాత్కాలిక ఉపశమ నం పొందడానికి చాలామంది పిల్లలు డ్రగ్స్ ను ఆశ్రయిస్తు న్నారు. స్నేహితులు బలవం తం పెట్టడంతో డ్రగ్స్ కు అలవాటు పడడం దాని నుండి నిర్మూలన చేసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, వినోద కార్యక్ర మాల్లో ధూమపానం మద్య పానం డ్రగ్స్ వినియోగాన్ని సాధారణ అంశంగా ఫ్యాషన్ గా చూపుతున్నారు.

మానసిక ఆరోగ్యమే ముఖ్యం
నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు చాలా ఉపయోగపడతారు రోజు కనీసం 10 నిమిషాలైనా ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటూ తమ గురించి తాము తెలుసుకునేలా సెల్ఫ్ ఎవర్నెస్ ప్రోగ్రాం ను ప్రోత్సహించాలి. శారీరిక సమస్యల పరిష్కారానికి, అవగాహన భరోసా పిల్లల్లో కల్పించాలి. ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనకై సమావేశాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకై విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బంది ప్రజలు యాక్ట్ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.
