న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.

సదస్సును జయప్రదం చేయండి..
న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం..

మర్చి 9వేంకటాపురం మండలకేంద్రంలో న్యాయం నిపుణులతో.

గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.

వాజేడు (నేటి ధాత్రి ):-
ములుగు జిల్లా – వాజేడు మండలం కేంద్రంలో ఇప్పగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి, పూనెం,సాయి హాజరై భద్రాచలం కేంద్రంగా ఆదిమ జాతుల కోసం,న్యాయ కళాశాల కోసం మరో న్యాయ పోరాటంలో భాగంగా మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రం కాపేడ్ గ్రౌండ్ లో ఆదివాసి న్యాయ నిపుణులు,ఆదివాసీ సంఘాల నాయకులతో సదస్సును ఏర్పాటు చేసి జయప్రదం చేయాలని, కరపత్రాలు విడుదల చేశారు . తదనంతరం, పూనం సాయి మాట్లాడుతూ .ఏజెన్సీ ప్రాంత అడవి బిడ్డల విద్యారంగంలో ముందుకు రాణించాలని,ప్రత్యేక దృక్పథంతో సుమారు నాలుగు దశాబ్దాలుగా అడవి బిడ్డలుగా ఆలు పెరగని పోరాటాలు కొనసాగించిన ఘనత గొండ్వాన సంక్షేమ పరిషత్ దకిందని,ప్రత్యేక ఉద్యమ సంఘంగా ఆదిమ జాతులకు సేవలు అందించిన చరిత్ర జిఎస్పి కి ఉందని అన్నారు. ఆదిమ జాతుల సంక్షేమాన్ని అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించిచారని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్, ఐ ఏ ఎస్ జి.ఎస్.పి పోరాటాలను గుర్తించి ఆదిమ విద్యార్థులను మరింత విద్య రంగంలో వెన్ను దన్నుగా నిలిచారని గుర్తుచేశారు.ఉద్యోగ రంగంలో ఆదివాసులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 అమలు పరచాలి ప్రత్యేక కృషి చేసిన ఘనత ఆనాటి కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్ కి తగ్గిందని వారి వల్లే భద్రాచలంలో జూనియర్ డిగ్రీ కాలేజీలలో 6%శాతం రిజర్వేషన్ నుండి జీవో నెంబర్ 267 ద్వారా 100% అమలుకు నోచుకుందని ఆయన అన్నారు.అప్పటి ఐటీడీఏ పీ వో ప్రవీణ్ ప్రకాష్,ఐ ఏ ఎస్ అప్పటి జిల్లా కలెక్టర్ వారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల భద్రాచలం కేంద్రంలోని టి టి సి బి.ఎ డ్ కాలేజీలు వచ్చాయని అన్నారు.విద్యార్థుల స్వయంపాలన హాస్టల్స్ కూడా 1996,2017 కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.ఇదే తరుణంలో ఆదిమ జాతులకు మరింత చైతన్య రాణించేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లా తీర్చిదిద్దేందుకు,భూభాగంలో భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాలను మంజూరు చేయాలని, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు కారం,రాజబాబు పదం, సుధాకర్ కారం, గణపతి వెంకటేశ్వర్లు ఆనంద్, మోడెం నవీన్ ,శ్రీనాద్, శ్రీకాంత్, రవి, మడకం ప్రశాంత్, విష్ణు, ఇప్పగూడెం గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!