
Bapuji 110th Jayanti Celebrated in Manchiryal
బాపూజీ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుదాం
దశాబ్దాల పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాపూజీ 110 వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మహేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం టీఆర్పీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి ఉద్యమకారుడు బాపూజీ అని అన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులని,బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలను గుర్తు చేసారు. తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి తెలంగాణ జాతిపితగా కీర్తిని గడించారని అన్నారు.పదవులకన్నా ప్రాంతానికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి,తన పదవులను వదులుకుని ఉద్యమాన్ని ఉదృతం చేసి, ప్రజలను చైతన్యం చేసారని అన్నారు.వారి జయంతి సందర్భంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డ, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ని స్పూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో మన రాజ్యాధికారం సాధించుకునేందుకు అధికారం,ఆత్మగౌరవం,వాటా నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్,పడాల శివతేజ,కొత్తూరి సంతోష్, కుంట రాజేంద్రప్రసాద్, నామాల తిరుపతి,అకెనపల్లి మధు,పెట్టం రాజేష్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.