సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
గుండాల ఎంపీపీ ముక్తి సత్యం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటాల ద్వారానే పరిష్కరించుకోగలుగుతామని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు.
సోమవారం మండలంలో కోడవటంచ గ్రామంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తను మాట్లాడుతూ కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల ప్రజలు వర్ష కాలంవస్తే దిన దిన గండంగా గడిపే పరిస్థితి వచ్చిందని కిన్నెరసాని (ఏడు మలకల వాగు)పై ఉన్న లో లెవెల్ వంతెనపై ఐ లెవెల్ వంతెన ఏర్పాటు చేయాలని ఏడు మెలకల చెక్ డ్యాం పై వేసిన ఇసుక మేటలు తొలగించాలని,కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్,జిసిసి ద్వారా రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలపై గత ఐదు సంవత్సరాలలో మండల, జిల్లాఅధికారుల దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి,వజ్జ ఎర్రయ్య,కల్తీ రామ్మూర్తి, వజ్జ మంగయ్య, ఈసం యానయ్య, ఈసం మల్లయ్య,ఈసం కృష్ణ, ఈసం రమేష్, ఈసం రామచంద్రు, చీమల వసంతరావు, ఈసం గోపయ్య తదితరులు పాల్గొన్నారు.