చలో నల్లగొండ సభను విజయవంతం చేయండి

: కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు..

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి

కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 13న చలో నల్లగొండ జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని శనివారం రోజున అడ్డగూడూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ……గత 9 సంవత్సరాల కేసిఆర్ పాలనలో కృష్ణనది జలాలను కేంద్రానికి అప్పజెప్పకుండా యావత్ మన తెలంగాణ రైతుల కుటుంబాల బాగుకోసం ఎదురొడ్డి నిలబడి నీళ్ళను అందించిన ఘనత కే‌సిఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.కానీ నేడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారం వచ్చి మూడు నెలలు కాకముందే కేంద్రం వద్ద మోకారిల్లి కృష్ణానది జలాలపై పూర్తి అధికారం కెంద్రానికే అప్పజెప్పడం చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణలోని 5 జిల్లాల రైతుల కుటుంబాలు రోడ్డున పడుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో యంపిపి దర్శనాల అంజయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, సింగిల్ విండో చైర్మన్ పోన్నాల వెంకటేశ్వర్లు,మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్దన్ రెడ్డి,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోనీ,పట్టణశాఖ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి, ఉప సర్పంచ్ వడకాల రణధీర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు, బాలెంల అరవింద్, మందుల కిరణ్, బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్, వార్డు మెంబర్ దాసరి బాలరాజు,పట్టణశాఖ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి,యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు గూడెపు నరేష్, పోలేపాక అబ్బులు,మారోజు వెంకన్న,పొన్నాల నవీన్,అలువాల శంకర్ ,బాలెంల బాబు,బాలెంల మల్లేష్ ముంబాయి,బోడ చింటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!