ఛలో వరంగల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T133044.037.wav?_=1

ఛలో వరంగల్

11 ఆగస్టు 2025న మహా పాదయాత్రను విజయవం తం చేద్దాం

ఉద్యమకారుల ఫోరం హ నుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టిగణేష్

శాయంపేట నేటిధాత్రి:

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినమేనిఫెస్టో లో ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలము మరియు నెలకు ₹25,000 పెన్షన్ అంద జేస్తామనిహామీ ఇచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్ని కల హామీలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ ఉద్యమ కారుల యోగక్షేమాలను పూర్తి గా నిర్లక్ష్యం చేయడం వల్లఉద్య మకారులలో తీవ్రమైన అసం తృప్తి నెలకొంది.ఈ న్యాయ మైన డిమాండ్లను ప్రభుత్వా నికి తెలియజేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు మెమొరాండాలు సమర్పించడం, ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వ హించడం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి తగిన స్పంద న లేకపోవడంతో, ఉద్యమ కారులు మరింత బలంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు
ఈ నేపథ్యంలో 11 ఆగస్టు 2025 న మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ పాద యాత్ర హన్మకొండ వేయి స్తంభాల గుడి నుండి ఏకశిలా పార్క్ వరకు ఘనంగా జరుగును.ఈ పాదయాత్రలో తెలంగాణ ఉద్యమ కారులం దరూ పెద్దసంఖ్యలో పాల్గొని మన గళాన్ని, మన నినాదాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లా లని, మన హక్కుల కోసం సమైక్యంగా నిలవాలని తెలం గాణ ఉద్యమకుల ఫోరం పిలుపునిచ్చింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version