రాహుల్ గాంధీ ప్రధానిచేద్దాం కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
*-కాంగ్రెస్ పార్టీ మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు పొలం పెళ్లి శంకర్

లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలని పొలం పెళ్లి శంకర్

ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాయని ఆరోపించారు. మోసపూరిత హామీలతో మభ్యపెడుతూ వస్తున్న బీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించి.. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఓట్లు వేయాలని కోరారురాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని, రాహుల్ గాంధీ గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. 13న జరగబోయే లోక్ సభ ఎన్నికలలో కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!